ఆంధ్రప్రదేశ్
సినీనటి రోజాపై పరువునష్టం దావా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 27 January 2016
విశాఖ: దళిత మహిళ అయిన తనపై వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వైకాపా ఎమ్మెల్యే, సినీనటి రోజాపై కోటి రూపాయల మేరకు పరువు నష్టం దావా వేసినట్లు పాయకరావుపేట టిడిపి ఎమ్మెల్యే వి.అనిత బుధవారం ఇక్కడ విలేకరులకు చెప్పారు. రోజా వ్యాఖ్యలు తనను, తన కుటుంబ సభ్యులను తీవ్ర మనస్తాపానికి గురి చేసాయని అన్నారు. రోజాచేత క్షమాపణ చెప్పించేదాకా తాను న్యాయ పోరాటం చేస్తానన్నారు. నోరు పారేసుకుంటున్న రోజాను వైకాపా అధినేత జగన్ మందలించక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. కాగా, తన నియోజకవర్గంలో దక్కన్ కెమికల్ పరిశ్రమ వల్ల ప్రజలకు ప్రమాదం పొంచి ఉందన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లానని ఆమె చెప్పారు.