అనంతపురం

వ్యక్తి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిలమత్తూరు, ఆగస్టు 21: మండల పరిధిలోని మరవకొత్తపల్లిలో చాకలి శ్రీనివాసులు (37) చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై జమాల్‌బాషా తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. చాకలి శ్రీనివాసులు కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై ఆదివారం గ్రామ సమీపంలోని చింత చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతునికి భార్యతోపాటు ముగ్గురు పిల్లలు ఉన్నట్లు ఆయన తెలిపారు. భార్య రమణమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ధర్మవరం రూరల్, ఆగస్టు 21: మండలంలోని జాతీయ రహదారి సీతారాంపల్లి క్రాస్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో శివరుద్రయ్య(55) మృతి చెందాడు. వివరాల ప్రకారం కణేకల్ మండలం కల్వకుర్తి గ్రామానికి చెందిన శివరుద్రయ్య, మరికొందరు కలిసి ద్విచక్ర వాహనాల్లో రేగాటిపల్లికి పెళ్లిచూపుల నిమిత్తం వచ్చారు. తిరిగి వెళుతున్న సమయంలో సీతారాంపల్లి వద్ద హైవేలోకి వెళ్తున్న సమయంలో బెంగళూరు వైపు నుండి వచ్చిన కారు శివరుద్రయ్య బైక్‌ను ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకుని కేసు దర్యాప్తు చేపట్టారు.