అనంతపురం

విద్యుత్ చార్జీల పెంపుపై కాంగ్రెస్ నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టపర్తి, ఏప్రిల్ 2: విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. శనివారం పుట్టపర్తి సబ్ డివిజన్ కార్యాలయం ముందు పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి సామకోటి ఆదినారాయణ ఆధ్వర్యంలో భైఠాయించి నిరసన తెలిపారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే రెండుసార్లు విద్యుత్ చార్జీలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నారన్నారు. తీవ్ర కరవు సంభవించి ప్రజలు ఇబ్బందిపడుతుంటే మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుంటే వాటిని నియంత్రించలేని ప్రభుత్వం ప్రజలపై అదనపు భారాలను మోపడం సబబు కాదన్నారు. ఈ సందర్భంగా విద్యుత్ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సామకోటి ఈశ్వరయ్య, సుబ్బయ్యచౌదరి, కౌన్సిలర్ ఓబులేసు, రామయ్య, నరసింహులు, గంగిరెడ్డి పాల్గొన్నారు.