అనంతపురం

ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లమాడ, ఏప్రిల్ 3: తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల వద్దకు వచ్చిన ప్రజలను పదేపదే కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటూ కాలయాపన చేయకుండా సమస్యల పరిష్కారం పట్ల తక్షణమే స్పందించాలని అధికారులనుద్దేశించి సమాచార శాఖా మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన పల్లె సాయంత్రం మండలంలోని వంకరకుంటలో డీసీఎంఎస్ మాజీ అధ్యక్షుడు కేశవరెడ్డి గృహంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. రేషన్ కార్డులు, పాసు పుస్తకాలు, భూముల ఆన్‌లైన్, విద్యార్థుల ధృవీకరణ పత్రాలతో వచ్చే ప్రజల పనులు వెంటనే పూర్తిచేసి పంపాలన్నారు. ఉపాధి హామీ కూలీల సమస్యలున్నా కూడా సంబంధిత అధికారులు పరిష్కారం చేయడంలో ముందుండాలన్నారు. ప్రజలకు ఇబ్బందులెదురయ్యే విధంగా అధికారులెవ్వరైనా సరే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు తెదేపా నాయకులు, కార్యకర్తలు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.