అనంతపురం

విద్యార్థిని ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కదిరి, సెప్టెంబర్ 11: కదిరి మున్సిపల్ పరిధిలోని కుటాగుళ్ల రైల్వే గేట్ వద్ద వున్న కుమ్మరవాండ్లపల్లిలో రజిత (15) అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. రాజు కుమార్తె రజిత గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండగా శనివారం రాత్రి ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, గమనించిన కుటుంబీకులు వైద్య సేవల కోసం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. రజిత స్థానిక ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
బత్తలపల్లిలో వరుస చోరీలు
బత్తలపల్లి, సెప్టెంబర్ 11: బత్తలపల్లిలో శనివారం రాత్రి ఇళ్లకు తాళాలు వేసిన 5 ఇళ్లల్లో దొంగలు చొరబడి రూ.45 వేలు నగదు, బంగారం ఎత్తుకెళ్లినట్లు బాధితులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బత్తలపల్లిలోని ఓసీ కాలనీలో నంబూరి సురేష్, లక్ష్మినారాయణ, ప్రకాష్, విజయ్‌కుమార్, వెంకటమ్మ ఇళ్లల్లో 3 తులాల బంగారం, రూ.45 వేల నగదును ఎత్తుకెళ్లారు. చోరులు దొంగతనానికి పాల్పడేటప్పుడు పక్కన ఉన్న ఇళ్లకు గడియపెట్టి చాకచక్యంగా దొంగతనానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న బత్తలపల్లి, తాడిమర్రి ఎస్‌ఐలు సురేష్, రామ్‌భూపాల్, క్లూస్‌టీమ్‌తో దొంగతనాలు జరిగిన ప్రదేశాలను పరిశీలించి వేలిముద్రలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.