అనంతపురం
ఆర్టీసీ బస్సు బోల్తా..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 28 September 2016
గోరంట్ల, సెప్టెంబర్ 27 : మండల పరిధిలోని మల్లాపల్లి వద్ద మంగళవారం రాత్రి ఆర్టీసీ బస్సు బోల్తా పడి 12 మంది గాయపడ్డారు. తిరుపతి నుంచి హిందూపురం వెళ్తున్న ఆర్టీసీ ఆద్దె బస్సు మల్లాపల్లి మలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న మల్లాపల్లి లక్ష్మీదేవమ్మ, సోలశెట్టిపల్లి లక్ష్మీనారాయణరెడ్డి, తిరుపతి రామ్మూర్తి, ఓడిసి పెద్దనరసింహులు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఎనిమిది మంది స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 ద్వారా హిందూపురం ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు.