అనంతపురం

బస్సులో ప్రయాణికుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుత్తి, ఏప్రిల్ 5 : హైదరాబాద్‌కు చెందిన రామకృష్ణ ప్రైవేట్ బస్సులో ప్రయాణిస్తు మంగళవారం గుత్తి శివార్లలో మృతి చెందాడు. హైదరాబాద్‌కు చెందిన రామకృష్ణ (50) బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యాడు. బస్సు పట్టణ శివార్లలోని ఓ హోటల్ వద్దకు రాగానే డ్రైవర్‌ను ఆపి ప్రయాణికులకు టిఫిన్ చేయాల్సిందిగా సూచించాడు. దీంతో ప్రయాణికులు అందరూ దిగి టిఫిన్ చేయడానికి వెళ్తుంగా రామకృష్ణ మాత్రం బస్సు సీట్‌లోనే కూర్చుండి పోయాడు. గమణించిన డ్రైవర్ రామకృష్ణను కదిల్చాడు. రామకృష్ణ మాట్లాడకపోవడంతో బస్సును సరాసరి గుత్తి ప్రభుత్వాసుపత్రి వద్దకు తీసుకొచ్చి వైద్యులను సంప్రదించారు. పరిశీలించిన వైద్య సిబ్బంది రామకృష్ణ మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై బస్సు డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.