అనంతపురం

వడదెబ్బకు గురై ఇద్దరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుత్తి, ఏప్రిల్ 8 : మున్సిపాలిటీ పరిధిలోని తోట వీధి, గుత్తి ఆర్‌ఎస్‌లోని అంబేద్కర్‌నగర్‌లో కృష్ణయ్య(28), గుత్తికి చెందిన హుసేన్ సాబ్(53) వడదెబ్బ గురై మృతి చెందారు. కృష్ణయ్య ఆటో నడుపుకోవడం ద్వారా జీవనం సాగిస్తున్నాడు. గత కొద్ది రోజులుగా ఎండతీవ్రత పెరగడంతో గురువారం వడదెబ్బకు గురైన అస్వస్థతకు గురయ్యాడు. ఇంట్లో ప్రాథమిక వైద్య సేవలు పొందిన అర్ధరాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అదేవిధంగా గుత్తి కోట వీధికి చెందిన హుసేన్ సాబ్ కూలి పని చేసి జీవనం సాగిస్తుంటాడు. శుక్రవారం ఎండకు అస్వస్థతకు గురైన ఆయన్ను గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.