అనంతపురం

దుర్ముఖిలో అంతా సుభిక్షం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం, ఏప్రిల్ 8 : దుర్ముఖి నామ సంవత్సరంలో ఆశించిన మేర కు వర్షాలు కురుస్తాయని, అందరికీ సంక్షేమంగా ఉంటుందని వేదపండితులు ఆశీర్వచనాలు ఇవ్వడం హర్షణీయమని రాష్ట్ర బిసి కార్పొరేషన్ చైర్మన్ పామిశెట్టి రంగనాయకులు అన్నారు. దుర్ముఖి నామ సంవత్సరంలో ఎలాం టి ఒడిదుడుకులు లేకుండా అందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిడిఓ శ్రీలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఉగాది సంబరాల్లో రంగనాయకులు మాట్లాడుతూ వర్షాలు కురిస్తే రైతాంగం బాగు పడుతుందన్నారు. రైతులు సంతోషంగా ఉంటే సమాజం అన్ని విధాలా బాగు పడుతుందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారికంగా ఉగాది పండుగ రోజు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం స్ఫూర్తిదాయకమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో నవ్యాంధ్రప్రదేశ్ అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు మంచి పాలన అందిస్తూ రాష్ట్రాన్ని పురోభివృద్ధి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి సుభద్రమ్మ, జడ్‌పిటిసి ఆదినారాయణ, తహశీల్దార్ విశ్వనాథ్, వన్‌టౌన్ సిఐ ఇదుర్‌బాషా, ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కేశవులు పాల్గొనగా ప్రముఖ వేద పండితులు శాస్ర్తీ పంచాంగ శ్రవణం చేశారు.