అనంతపురం

గండాల దవాఖానా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, సెప్టెంబర్ 25 :‘ప్రభుత్వాస్పత్రుల్లోనే పురుడు పోయించుకోండి.. ప్రభుత్వ నజరానాలు అందుకోండి.. ప్రైవేటు ఆస్పత్రుల్లో డెంగీతో మరణిస్తే మా బాధ్యత కాదు.. ప్రభుత్వాస్పత్రుల్లో చేరాకనే ‘లెక్క’ చేస్తాం. పారిశుద్ధ్యం పాటించండి. ఫ్రై డే డ్రైడేగా పాటించండి. మందులన్నీ అందుబాటులో ఉన్నాయి. నిపుణులైన వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారు..’ ఇలా ఒకటేమిటి ఎన్నో రకాలుగా ప్రభుత్వ వైద్యశాలల ప్రాశస్త్యాన్ని అధికారులు, పాలకులు చాటి చెబుతుండటం పరిపాటిగా మారింది. పేదల పాలిట ప్రాణదాతలుగా నిలవాల్సిన ప్రభుత్వాస్పత్రులు మృత్యు కుహరాలుగా మారుతున్నాయి. ఇక్కడ రోగుల బాధలన్నా వారి ప్రాణాలన్నా లెక్కా జమ ఉండదు. రోజూ చూసే కేసులే ఎవడి ఖర్మకు ఎవడు బాధ్యుడు అనే నిర్లిప్తత ఏమీ కాదులే అనే నిర్లక్ష్య ధోరణితో రోగుల ప్రాణాలు గాలిలో కలిసి పోతున్న ఘటనలు పునరావృతమవుతూనే ఉన్నాయి. దీంతో నేను రాను బిడ్డో దండాల దవాఖాను అనే భయాందోళనలు తప్పడం లేదు. సోమవారం కీర్తన (9) అనే చిన్నారి వైద్యులు సకాలంలో అందుబాటులో లేకపోవడంతో మృత్యువాత పడటం కలకలం రేపింది. తీవ్ర జ్వరంతో ఉండగా, బిడ్డ ప్రాణాలు కాపాడుకోవడానికి కొత్త చెరువు మండలం తలమర్లకు చెందిన రమణ, వరలక్ష్మి దంపతులు ప్రభుత్వ సర్వజనాస్పత్రికి సాయంత్రం తీసుకొచ్చారు. ఆ సమయంలో డ్యూటీలో ఉండాల్సిన డాక్టర్ శివకుమార్ అందుబాటులో లేరు. గంట ముందే ఎమర్జన్సీ వార్డులోంచి వెళ్లిపోయారని బాధితులు ఆరోపించారు. డ్యూటీకి రావాల్సిన నీలిమ అనే డాక్టర్ అర్ద గంట ఆలస్యంగా వచ్చారు. అప్పటికే తీవ్ర జ్వరంతో ఉన్న చిన్నారి మృత్యువాత పడింది. దీంతో తల్లిదండ్రుల గుండెకోతకు గురవయ్యారు. ఈ దారుణం చూసిన ప్రతి ఒక్కరూ కంట తడిపెట్టారు. కొత్తతినడానికే తిండి లేక, కరవు కోరల్లో చిక్కి అల్లాడుతున్న జిల్లా ప్రజలు గత్యంతరం లేక, విధి రాత అనుకుంటూ తప్పనిసరిగా ప్రభుత్వాస్పత్రులకు వస్తున్నారు. కాగా జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటం, వైద్యులు పరస్పరం విధి నిర్వహణలో సహకరించుకోకపోవడం, విధులకు ఒకరు వచ్చాకే, మరొకరు వెళ్లాలన్న నిబంధనల్ని తుంగలో తొక్కి ప్రైవేటు క్లినిక్కులకే ప్రాధాన్యత ఇస్తుండటం వంటి నిర్లక్ష్య ధోరణితో రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఆర్థోపెడిక్ వార్డు, గైనిక్, ఛిల్డ్రన్స్ తదితర ముఖ్యమైన వార్డుల్లో రోగులపాట్లు చెప్పనలవి కాదు.
ఆస్పత్రిలో ఎవరికి వారే యమునా తీరే..
ముఖ్యంగా సర్వజనాస్పత్రిలో మొత్తం 140 మంది దాకా వైద్యులు ఉన్నారు. వీరిలో క్యాజువాలిటీకి 12 మంది రోటేషన్ పద్ధతిలో పని చేస్తున్నారు. మరో ఐదుగురు వైద్యులు అవసరం. వీరు మినహా మిగతా డాక్టర్లందరినీ ప్రభుత్వ వైద్య కళాశాల నుంచే సర్వజనాస్పత్రిలో ఓపి, వార్డులకు విధులకు కేటాయిస్తున్నారు. ఈ క్రమంలో ఔట్ పేషెంట్లుగా వచ్చే వారిని అనేక మంది వైద్యులు పెద్దగా పట్టించుకునే వారే లేదు. ఓపి విభాగంలో, ఎమర్జెన్సీ వార్డులు, ఇతర ఐపి వార్డుల్లో హౌస్ సర్జన్లతోనే నెట్టుకొస్తున్నారు. సీరియస్ కేసులకు సైతం ఓపిలో మందుల చీటీ రాసి వాడుకోండంటూ పంపించేస్తున్న ఘటనలు నిత్యం రివాజుగా మారాయి. ఎమర్జెన్సీలో సైతం హౌస్ సర్జన్ల సేవలే దిక్కయ్యాయి. అక్కడ తగినంత మంది కింది స్థాయి సిబ్బంది (ఎంఎన్‌ఒలు, ఎఫ్‌ఎన్‌ఓలు) లేకపోవడంతో ప్రమాదాలతో వచ్చిన వారి గతి దైవాదీనంగా మారుతోంది. నేల మీద నూకలుంటే బతికి బట్టకడతారు.. లేకుంటే ఆయుష్షుకు మూడినట్లేనన్న అపవాదు తప్పడం లేదు. సర్వజనాస్పత్రిలో పాలన అస్తవ్యస్తంగా ఉంది. అయినా పట్టించుకునే నాథుడే లేడని నిత్యం ఆరోపణలు వెల్లువెత్తుతున్నా అధికారులు, పాలకులకు పట్టడం లేదు.
కఠిన చర్యలు తీసుకుంటాం :
* డాక్టర్ జగన్నాథ్, సూపరింటెండెంట్
గతంలో కూడా వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ఆరోపణలున్నాయి. చిన్నారి కీర్తన మృతిపై కమిటీ వేసి విచారణ జరిపిస్తాము. బాధ్యులైన వైద్యులపై కఠినంగా వ్యవహరిస్తాము. జిల్లా అధికారులు, ఉన్నతాధికారుల దృష్టికి సమస్యలు కూడా తీసుకెళ్లి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తాము.

హిందూ ధర్మ రక్షణకై ప్రాణాలైనా త్యజిస్తాం
*విహెచ్‌పి రాయలసీమ విభాగ్ అధ్యక్షులు రాధాకృష్ణ
తాడిపత్రి, సెప్టెంబర్ 25: హిందూ సమాజం కోసం మనమందరం మరొక్కసారి కలసికట్టుగా మన శక్తిని చాటాలని, హిందూ ధర్మ రక్షణకై ప్రాణాలు త్యజించేందుకైన సిద్ధమని విశ్వహిందూ పరిషత్ రాయలసీమ విభాగ్ అధ్యక్షులు నిచ్చెనమెట్ల రాధాకృష్ణ పేర్కొన్నారు. స్థానిక విహెచ్‌పి కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో రాధాకృష్ణ మాట్లాడుతూ టివి ఛానెల్‌లో చర్చ సందర్బంగా మేధావి ముసుగులో విష వృక్షమైన కంచె ఐలయ్య పూజ్యయనీయుడైన పరిపూర్ణానంద స్వామిని, వారి మాతృమూర్తిని హీనంగా మాట్లాడటం చాలా దారుణమన్నారు. తెలుగు రాష్ట్రాలలో సామాజిక స్మగ్లర్లు-కోమటోళ్లు పుస్తకంపై గత 15 రోజులుగా లక్షలాదిమంది ఆర్యవైశ్యులు నిరసన తెలుపుతున్నా పట్టించుకునే నాథుడు కరువైనాడన్నారు. కంచె ఐలయ్యలాంటి ద్రోహులు హిందూత్వంపై దాడి చేయకుండా ఉండాలంటే పరిపూర్ణానందస్వామి, ఆర్యవైశ్యులు మాత్రమే చాలరని, హిందువులంతా ఏకం కావాలన్నారు. పరిపూర్ణానంద స్వామి ఉపన్యాసాలతో హిందువులను చైతన్యపరుస్తూ, గోశాలలను నిర్వహిస్తూ, పేద విద్యార్థులకు ఉచిత విద్యనందిస్తూ, హిందువులు మత మార్పిడిలకు గురికాకుండా హిందువులకు జ్ఞాన బోధ కల్గిస్తూ, హిందూ ధర్మాన్ని రక్షిస్తున్నారని తెలిపారు. హిందూ సమాజానికి మంచి చేస్తున్న పరిపూర్ణానంద స్వామిని కంచె ఐలయ్యలాంటి సామాజిక ద్రోహులు కించపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం 15 రోజులుగా సామాజిక స్మగ్లర్లు-కోమటోళ్లు పుస్తకాన్ని ఎందుకు నిషేధించ లేదని, కంచె ఐలయ్యను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని దూషించిన వెంటనే ఎలక్షన్ కమీషన్ 2రోజుల్లో చర్యలు తీసుకుందన్నారు. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదన్నారు. కంచె ఐలయ్యలాంటి ద్రోహులకు ప్రభుత్వాలు మద్దతు పలుకుతున్నాయంటు ఆరోపించారు. ప్రభుత్వాధి నేతలను దూషించినపుడే చట్టం పనిచేస్తుందా, హిందువుల మనోభావాలు దెబ్బతిన్నా ప్రభుత్వాలకు చీమకుట్టినట్లు లేదాంటు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో విహెచ్‌పి పట్టణ అధ్యక్షులు నరసింహులు, విహెచ్‌పి జిల్లాసేవాప్రముఖ్ రామాంజినేయులు, పెద్దపప్పూరు విహెచ్‌పి ప్రముఖ్ సూర్యనారాయణలు పాల్గొన్నారు.

మాగోడెవరికీ పట్టదా!
* ప్రజలు, వ్యాపారుల ఆగ్రహం
అనంతపురంటౌన్, సెప్టెంబర్ 25: నగరంలో రహదారుల విస్తరణ చేపట్టిన ప్రతిసారీ మొక్కుబడిగా పనులు ప్రారంభించటం తర్వాత నిలిపివేయటం జరుగుతుండటంపై వ్యాపారులు, ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఒక నేత చెప్పారని హడావిడిగా ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టటం తర్వాత మరో నేత వద్దన్నారని నిలిపివేయటంతో తాము సమిధలమవుతున్నామని వ్యాపారులు వాపోతున్నారు. రహదారి విస్తరణలకు అనేక మార్గాలు ఉన్నా వాటి ఊసెత్తకుండా పనిగట్టుకుని నేతల పంతాలు, పట్టింపులకు తమను లక్ష్యంగా చేసుకోవటం జరుగుతోందని వ్యాపారవర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ప్రజల సౌకర్యార్థం రహదారులు విస్తరించాలనుకుంటే నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని కోరుతున్నారు. వాటిని బాధిత వ్యాపారులకు వివరించి వారి సమ్మతిని పొందితే బాగుంటుందని పేర్కొంటున్నారు. ఆక్రమణల తొలగింపు పేరుతో ప్రతిసారి అధికారులు, పోలీసులు హడావిడి చేస్తుండటంతో తమకు కంటి మీద కునుకు లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొలుత అధికార పార్టీ నేతల నడుమ సయోధ్యను సాధించాలని సూచిస్తున్నారు. ఇరువురు నేతలు ఎవరికి వారు తమ పంతం, మా మాటే నెగ్గాలనుకోవటం వలన తాము ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో స్థలం కోల్పోయిన వారికి పరిహారం అందించి రహదారి విస్తరణలు చేపడితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. రహదారి విస్తరణ వలన జరిగే అభివృద్ధికి తాము అడ్డంకి కాదంటున్నారు. నిర్దిష్టమైన హామీలు ఇవ్వకుండా హడావిడిగా ఆక్రమణలు కూల్చివేయటానికే తాము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని అన్నారు. గడచిన కొన్ని నెలల కాలంలో ఆక్రమణల కూల్చివేత పేరుతో అధికారులు హడావిడి చేయటం ఇది మూడోసారని తెలిపారు. నేతల హడావిడికి తాము నష్టపోవటానికి సిద్ధంగా లేమని పేర్కొంటున్నారు. రహదారికి ఇరువైపులా 25 అడుగుల వంతున కూల్చివేతకు మార్కింగ్ ఇచ్చామని అధికారులు పేర్కొంటున్నారని అన్నారు. దీనివలన తాము పూర్తిగా నష్టపోతామని స్పష్టం చేస్తున్నారు. పరిహారం అంశం తేల్చిన తర్వాత ఆక్రమణల కూల్చివేత చేపట్టాలని వ్యాపారులు, ప్రజలు కోరుకుంటున్నారు.
పాతూరులో ఆక్రమణల తొలగింపు
అనంతపురంటౌన్, సెప్టెంబర్ 25: నగరంలోని పాతూరులో తిలక్‌రోడ్డు, గాంధీబజార్ రహదార్ల కిరువైపులా ఆక్రమణల తొలగింపునకు సోమవారం అధికారులు చర్యలు చేపట్టారు. జెసిబి యంత్రాలతోపాటు మానవ వనరులను ఉపయోగించి కూల్చివేతలు ప్రారంభించారు. కూల్చివేతలను వ్యాపారులు, గృహిణులు అడ్డుకున్నారు. జెసిబి యంత్రాలకు అడ్డుగా నేలపై భైఠాయించారు. అధికారులను నిలదీశారు. దీనితో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పలుమార్లు ఆక్రమణల పేరుతో అధికారులు వచ్చి హంగామా చేస్తూ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. ఆక్రమణల పేరుతో షాపులను, గృహాలను కూల్చి వేస్తే తాము వీధినపడాల్సి వస్తోందన్నారు. దసరా పండుగకు సరుకు లక్షలు వెచ్చించి తెచ్చుకున్నామని అన్నారు. వ్యాపారులకు అండగా వామపక్ష పార్టీ కార్యకర్తలు జెసిబి యంత్రాల ముందు భైఠాయించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి జగదీష్ చర్యల పట్ల పోలీస్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చేపట్టిన ఆక్రమణలను అడ్డుకోవటం సరికాదన్నారు. రెవెన్యూ అధికారిపై దుందుడుకుగా వ్యవహరించటం తగదన్నారు. వాహనాల అద్దాలను పగులగొట్టటం సరికాదని అన్నారు. దీనిపై జగదీష్ స్పందిస్తూ తాము రౌడీలం కాదని అన్నారు. వ్యాపారులకు తాము మద్దతుగా ఉన్నామన్నారు. ఆక్రమణల తొలగింపునకు అడ్డుతగిలిన వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. తర్వాత తిలక్ రోడ్డులో గాంధీ ఖాదీభాండార్ కేంద్రంపై అంతస్తు భాగాన్ని మానవవనరులను ఉపయోగించి కొంత భాగాన్ని కూల్చివేశారు. తర్వాత జెసిబితో మరో షాపు పైకప్పుకొంత భాగం తొలగించారు. అయితే రెవెన్యూ డివిజనల్ అధికారి మలోల నుంచి స్పష్టమైన ఆదేశాలు లభించకపోవటంతో పోలీసు అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆక్రమణలు కూల్చటంపై నిర్దిష్ట ఆదేశాలు ఇవ్వకుండా తటపటాయించటం వలన స్థానికుల వ్యతిరేకత, ఆందోళనను నిరోధించటం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఈ దశలో ఉద్రిక్తతలను సడలించటానికి తాత్కాలికంగా అధికారులు కూల్చివేత ప్రక్రియను నిలిపివేశారు. అయితే నంద్యాలలో రోడ్డు విస్తరణ, విజయనగర్ కాలనీలో ఇళ్ల కూల్చివేతల దృష్ట్యా రహదారి విస్తరణలు అనివార్యమన్న విషయం స్థానికులకు అర్థమైంది. దీనితో కొంతమంది వ్యాపారులు తిరిగి మరోమారు అధికారులు ఆకస్మికంగా కూల్చివేత పనులు చేపడితే పూర్తిగా నష్టపోతామన్న నిర్ణయానికి వచ్చారు. దీనితో వారిలో కొంతమంది స్వచ్ఛందంగా సామగ్రిని సర్దుకోవటం కనిపించింది. ఆక్రమణల కూల్చివేతలో పూర్తిగా నష్టపోకుండా ముందస్తు చర్యలు చేపట్టటం కనిపించింది. అయితే మాస్టర్‌ప్లాన్ రోడ్డు ప్రకారం వంద అడుగులు రహదారి విస్తరిస్తారా లేక 80 అడుగులా అన్న అంశంపై నిర్దిష్ట సమాచారం లేకపోవటంతో వ్యాపారులు సంశయంలో పడిపోయారు. ఈ అంశంపై స్పష్టతనిచ్చేందుకు మంగళవారం కలెక్టర్ సమక్షంలో వ్యాపారులతో అధికారులు సమావేశం జరుపనున్నట్లు అధికారవర్గాల భోగట్టా. అలాగే ఆక్రమణల కూల్చివేతలు 100 అడుగులు, 80 అడుగులు, 50 అడుగులైతే వ్యయం ఎంతవుతుంది, పరిహారం ఎంత ఇవ్వాల్సి వస్తుందన్న అంశంపై లెక్కలు తేల్చటంపై అధికారులు నిమగ్నమయ్యారు. ఈమేరకు అంచనాలను రూపొందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆక్రమణల కూల్చివేత కార్యక్రమంలో ఆర్‌డిఓ మలోల, కమిషనర్ పివివిఎస్‌ఎన్ మూర్తి, ట్రాఫిక్ డిఎస్‌పి నరసింగప్ప, వన్‌టౌన్ సిఐ సాయిప్రసాద్, తహశీల్దార్ అన్వర్, ఎసిపి ఇషాక్, టౌన్‌ప్లానింగ్ అధికారులు, ఇంజనీరింగ్ వర్కర్స్, చైన్‌మెన్లు పాల్గొన్నారు. ఆక్రమణల తొలగింపులో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.

మూడు ముక్కలాట..
* రోడ్ల విస్తరణలో రాజకీయం * తిలక్ రోడ్డులో స్టే తెచ్చుకున్న 47 మంది వ్యాపారులు
* గాంధీబజార్ పాత రికార్డుల కోసం వెదుకులాట *పాత నోటీసుల ఆధారంగా ఆక్రమణల కూల్చివేత

అనంతపురం, సెప్టెంబర్ 25: అనంతపురం నగరంలో తిలక్ రోడ్డు, గాంధీ బజార్ రోడ్డు విస్తరణ వ్యవహారం మరోమారు తెరపైకి రావడంతో ఇటు అధికారులు,
అటు గృహ, దుకాణ యజమానుల్లో కేక పుట్టిస్తోంది. గత ఏడాది నుంచి ఈ రోడ్ల విస్తరణ వ్యవహారం ఓ ప్రహసనంలా తయారైంది. చిత్తశుద్ధితో వెడల్పు పనులు చేపడతారా లేక వదిలేస్తారా ఇలా ఎన్నిసార్లు హడావుడి చేసి ప్రజల్ని ఇబ్బందులపాలు చేస్తారు అనే సందేహాలకు తగిన సమాధానం నగర వాసులకు దొరకడం లేదు. ఓవైపు అనంతపురం ఎంపి జెసి దివాకర్‌రెడ్డి, మరోవైపు ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌చౌదరి, మేయర్ స్వరూప, వీరి మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరులో తమ పరిస్థితి ఏమిటోనన్న భయాందోళనలతో బాధిత ప్రజలు, వ్యాపారుల వ్యతిరేకత వెరసి మూడు ముక్కలాటను తలపిస్తోంది. సోమవారం ఉదయం తెల్లవారు జామున 5.30 గంటలకే మున్సిపల్, రెవెన్యూ, ఆర్‌అండ్‌బి అధికారులు వేర్వేరుగా తిలక్‌రోడ్డు, గాంధీ బజార్‌కు చేరుకుని ఆక్రమణ తొలగింపు చేపట్టారు. ఈ విషయంపై ఆదివారం రాత్రి వ్యాపారులు సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన కూడా చేశారు. అయితే ఆక్రమణలు మాత్రమే తొలగిస్తూ, కోర్టు స్టే ఉన్న ఇళ్లు, దుకాణాల జోలికి వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. రెండు దశాబ్దాలకు పైగా ఈ రోడ్ల విస్తరణపై రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. నగర ప్రజలు సైతం ఈ రోడ్ల విస్తరణ ఎప్పుడు జరుగుతుందా అని ఎదురు చూపులు చూస్తున్నారు. గత ఏడాది రెండుమార్లు తిలక్ రోడ్డు విస్తరణకు అధికారులు పూనుకున్నా పనులు ముందుకు సాగలేదు. ఎంపి జెసి దివాకర్‌రెడ్డి ధర్నాతో ముఖ్యమంత్రి స్పందించి ముగ్గురు మంత్రులతో త్రిసభ్య కమిటీ వేశారు. తర్వాత ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండిపోయింది. ఇటీవల జెసి దివాకర్‌రెడ్డి రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించడంతో మూడోమారు రోడ్ల విస్తరణకు పూనుకున్నారు. పాతూరులోని పాత నీలం థియేటర్ ప్రాంతం నుంచి తాడిపత్రి బస్టాండు సర్కిల్ వరకు, గాంధీ బజార్‌లో దర్గా ఆర్చి నుంచి పాతూరు గాంధీ విగ్రహం వరకు 800 మీటర్ల పొడవున రోడ్ల వెడల్పు మొదలైంది. అయితే మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్ల విస్తరణ చేపట్టడం లేదు. తిలక్‌రోడ్డులో ఓవైపు 6 నుంచి 8 అడుగులు, మరోవైపు 8 నుంచి 10 అడుగుల మేర వెడల్పు చేయాల్సి ఉంది. గాంధీ బజార్‌లో ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో స్పష్టత లేదు. ప్రస్తుతం రెవెన్యూ, మున్సిపల్ అధికారుల వద్ద లభ్యమైన రికార్డుల మేరకు 800 అడుగుల పొడవున మార్కింగ్ ఇచ్చారు. కానీ వెడల్పు ఎంత చేయాలన్న అంశంపై పాత రికార్డులు లభ్యం కాలేదు. రెవెన్యూ వారి వద్ద కూడా అవి ఉన్నాయా లేవా అనే సందేహాలు ఆర్‌అండ్‌బి అధికారులకు ఉండటం గమనార్హం. సిపిఐ మద్దతులో వ్యాపారులు, ఇళ్ల యజమానులు ఆందోళనకు దిగి పనులను అడ్డుకున్నారు. ఇప్పటికే తిలక్ రోడ్డులో వ్యాపారులు, ఇళ్ల యజమానులు 47 మంది హైకోర్టులో 37 కేసులు వేసి స్టే తెచ్చారు. ఈ తతంగం వెనుక స్థానిక ఎమ్మెల్యే వి.ప్రభాకర్‌చౌదరి, మేయర్ స్వరూప ఉన్నట్లు ఆరోపణలున్నాయి. కాగా కోర్టు స్టే ఉన్న, సొంత స్థలం ఉన్న వారిని మినహాయించి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వాటిలో గత ఏడాది ఇచ్చిన మార్కింగ్, పాత నోటీసుల ఆధారంగా 6 నిర్మాణాలను తొలగించారు. అలాగే గాంధీ బజార్‌లో ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న భూ రికార్డుల ఆధారంగా ఆక్రమణల్లో కట్టిన 8 నిర్మాణాలను కూల్చేశారు. పాత రికార్డులు అందుబాటులో లేకపోవడంతో ఈ రోడ్డు వెడల్పుపై స్పష్టత లేదని ఆర్‌అండ్‌బి డిఇ సంజీవయ్య చెప్పడం విశేషం. అయితే ఇటు తిలక్‌రోడ్డు, అటు గాంధీ బజార్ రోడ్డులో ఎన్ని అడుగుల వెడల్పు విస్తరణ చేపట్టాలి ఇంకా ఆక్రమణలు ఎంత మేర ఉన్నాయి సొంత స్థలాల విస్తీర్ణం ఎంత పరిహారం ఎంత ఇవ్వాలి ఎప్పటి లోగా కోర్టు కేసుల్ని వెకేట్ చేయించాలన్న అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ప్రాంతాల్లోని గృహాల యజమానులు, కొందరు వ్యాపారులు ఎలాగూ విస్తరణ తప్పదని, అయితే ముందస్తుగా సమాచారం, కొంత గడువు కూడా ఇవ్వడంతో పాటు పరిహారం విషయంలోనూ న్యాయం చేయాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈనెల 27న కలెక్టర్‌తో మున్సిపల్, రెవెన్యూ, ఆర్‌అండ్‌బి అధికారులతో కలెక్టర్ నిర్వహించనున్న సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే. పాత రికార్డులు లభ్యం కాకుంటే పరిస్థితి ఏమిటన్నది తేలాల్సి ఉంది.