అనంతపురం

జిల్లా కేంద్రం అభివృద్ధికి పూర్తి నిధులు : ఎంపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంతకల్లు, డిసెంబర్ 28: ఈ ఏడాది జిల్లా కేంద్రం అభివృద్ది పరిచేందుకు ఎంపీ నిధులు వెచ్చిస్తానని ఎంపీ జెసి దివాకర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం రైల్వే కోసి గెస్ట్ హౌస్‌కు విచ్చేసిన ఎంపీకి ముస్లిం మైనార్టీలు, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు పలు సమస్యలపై వినతి పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా అంజుమన్ కమిటీ అధ్యక్షులు సయ్యద్‌జాఫర్, అబ్ధుల్‌వాహాబ్, రహిమాన్‌సాబ్‌ల ఆధ్వర్యంలో ఎంపీని దుశ్శాలువాలు పూలమాలలతో సత్కరించారు. షాదీఖానా ఏర్పాటుకు నిధులు కేటాయించాలని కోరారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ దౌల్తాపురం ప్రభాకర్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ఎంపీ జెసి దివాకర్‌రెడ్డికి వినతి పత్రాన్ని అందచేశారు. ఈ సందర్భంగా మిల్లును ప్రైవేట్ వ్యక్తుల తెరిపించి ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. కల్లూరు మీదుగా వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలు మళ్లించాలని కోరారు. అదే విధంగా రెడ్డి సంక్షేమ సంఘం, పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు ఎంపీని కలసి వినతి పత్రాలను సమర్పించారు.