అనంతపురం

బీజేపీతోనే రాష్ట్భ్రావృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోమందేపల్లి, డిసెంబర్ 9 : బీజేపీతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమవుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, మహిళా మోర్చ జాతీయ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఆదివారం సోమందేపల్లిలో నిర్వహించిన ఇంటింటికీ బీజేపీ కార్యక్రమంలో పాల్గొని కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలను ఆప్యాయంగా పలుకరిస్తూ రాష్ట్భ్రావృద్ధి కోసం కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం అందచేసిన నిధులు, చేపట్టిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్భ్రావృద్ధి కోసం బీజేపీ కృషి చేస్తోందన్నారు. అయితే రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ పక్కదోవ పట్టించి ఆ పార్టీ చేస్తున్నట్లు గొప్పులు చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటోందన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్‌తో చంద్రబాబు జతగట్టడం విడ్డూరంగా ఉందన్నారు.