అనంతపురం

వాల్మీకుల యాత్ర పవిత్రమైంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనుకొండ, డిసెంబర్ 9:రాష్ట్రంలో వాల్మీకులు చేపట్టిన మహర్షి వాల్మీకి మహా రథయాత్ర ఎంతో పవిత్రమైందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. పెనుకొండ పట్టణంలో ఆదివారం ప్రొఫెసర్ సురేష్ అధ్యక్షతన నిర్వహించిన మహర్షి వాల్మీకి మహారథయాత్ర ముగింపు యాత్ర సభలో కన్నా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని చేస్తున్న ఉద్యమం ఎంతో న్యాయమైందన్నారు. అందువల్ల తాము బీజేపీ అధినాయకులతో ఈ విషయమై చర్చించగా వారు కూడా సానుకూలత తెలియచేశారన్నారు. కేంద్ర మాజీ మంత్రి పురంధ్రేశ్వరీ మాట్లాడుతూ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చడానికి తన వంతు కృషి చేస్తామని సభాముఖంగా హామీ ఇచ్చారు. ప్రొఫెసర్ సురేష్ మాట్లాడుతూ వాల్మీకులు చేపట్టిన రథయాత్రకు బీజేపీ అగ్ర నాయకులు కన్నా లక్ష్మీనారాయణ, పురంధ్రేశ్వరీ హాజరై వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు, బీజేపీ అగ్ర నాయకులను ఒప్పించేందకు కృషి చేస్తున్నందకు అభినందనలు తెలిపారు. వాల్మీకులందరూ ఐకమత్యంతో ఉంటూ సమస్యల సాధన కోసం కృషి చేయాలని ఆయన కోరారు.