అనంతపురం

చేనేత కార్మికుడి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మవరం, మే 6:అప్పుల బాధతో మరో చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం పట్టణంలో చోటు చేసుకుంది. స్థానిక పార్థసారథి నగర్‌కు చెందిన పామిశెట్టి ఈశ్వరయ్య(52) చేనేత కార్మికుడు చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక మానసిక వ్యధతో ఇంటిలోనే ఉరి వేసుకుని శుక్రవారం మృతిచెందాడు. ఇటీవల అప్పులు చేసి కుమార్తె పెళ్ళి చేయడంతో దాదాపు రూ.3లక్షల దాకా అప్పులు అయ్యాయని కుటుంబీకులు తెలిపారు. గురువారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి మిద్దెపై నిద్రిస్తున్న ఈశ్వరయ్య తరువాత కిందకు వచ్చి ఇంటిలో తాడుతో ఉరి వేసుకున్నాడు. తెల్లవారిన తర్వాత కుటుంబ సభ్యులు ఇంటిలోకి వెళ్ళి చూడగా తండ్రి ఉరి వేసుకున్న దృశ్యాన్ని చూసి చలించిపోయారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.