అనంతపురం

సింహవాహనంలో దర్శనమిచ్చిన లక్ష్మీనరసింహస్వామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉరవకొండ, మే 20 : పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఉహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం సింహవాహనంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం సుప్రభాత సేవలో భాగంగా స్వామివారికి అభిషేకం, ప్రత్యేక అలంకరణ, అర్చనలు, పూజలు చేశారు. నరసింహస్వామి జయంతిని పురస్కరించుకుని భూదే వి, శ్రీదేవి సమేతుడైన లక్ష్మీనరసింహస్వామి ఉత్సవమూర్తులను పట్టువస్త్రాలు, వివిధ ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. అనంతరం ప్రత్యేకంగా తయారుచేసిన వాహనంలో స్వామివారిని కొలువుదీర్చి ఆలయ ప్రాంగణంలో మేలతాళాల మధ్య ఊరేగించారు. ఉత్సవాన్ని తిలకించడానికి అనంతపురం, బళ్లారి, ఉరవకొండ తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఇఒ రమేష్‌బాబు, ప్రధాన అర్చకులు ద్వారకనాథాచార్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.