అనంతపురం

కాంట్రాక్టు ఉద్యోగి ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిర, మే 27 : పట్టణ సమీపంలోని ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో కాంట్రాక్టు పద్ధతిపై అటెండర్‌గా పనిచేస్తున్న తిమ్మప్ప (25) శుక్రవారం ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించి బాధితుడి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గుండుమలకు చెందిన తిమ్మప్ప గత పదేళ్లుగా కళాశాలలో అటెండర్‌గా పనిచేస్తున్నాడు. అయితే కళాశాలలో పనిచేస్తున్న ఓ ప్రొఫెసర్‌తోపాటు కార్యాలయ సూపరింటెండెంట్ వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించాడు. సెలవుపై వెళ్లినా వేతనంలో కోత విధిస్తున్నారని వాపోయాడు. అలాగే సక్రమంగా విధులు నిర్వహిస్తున్నా అనవసరంగా మెమోలు చేస్తూ మానసిక వేదనకు గురి చేస్తున్నట్లు తెలిపాడు. వేధింపులు తాళలేక కళాశాల ఆవరణలోనే కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. విషయాన్ని గమనించిన తోటి ఉద్యోగులు వెంటనే మంటలార్పి చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని బాధితుడితో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.