అనంతపురం

పరీక్షలకు వెళ్లి శవమయ్యాడు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాడికి : పరీక్షకు రాసేందకు వెళ్లిన ఇంటర్ విద్యార్థి ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందిన సంఘటన మంగళవారం మండల పరిధిలోని వి.పెండేకల్లులో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రంలోని మెయిన్ బజార్‌లో నివాసం ఉంటున్న వడ్డే రాముడు కుమారుడు హరిప్రసాద్ ఇంటర్ పరీక్షలకని తాడిపత్రికి ఆటోలో బయలుదేరాడు. ఆటో వి.పెండేకల్లు దగ్గరకు వెళ్లగానే విద్యార్థి హరిప్రసాద్ చేతిలో ఉన్న స్కేల్ చేయి జారి కింద పడింది. అందుకోవడానికి యత్నించే క్రమంలో ఆటో నిలిపే సమయంలో కిందకు పడిపోయాడని తోటి విద్యార్థులు తెలిపారు. ఈ సంఘటనలో తలకు తీవ్ర గాయమైన హరిప్రసాద్‌ను యాడికి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం అదనపు వైద్య చికిత్సల నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. హరిప్రసాద్ మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన హరిప్రసాద్ పరీక్షల కోసం వెళ్తూ మృతి చెందడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేక కన్నీరుమున్నీరుగా రోధించారు. ఈ సంఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.