అనంతపురం

ఫ్యాక్షన్ పెరిగే అవకాశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనుకొండ, జూన్ 3 : వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు జిల్లాలో ఫ్యాక్షన్‌ను పెంచే విధంగా ఉన్నాయని మంత్రి పరిటాల సునీత ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం మండల పరిధిలోని పరమేశపురంలో విలేఖరులతో మాట్లాడుతూ జగన్ వ్యాఖ్యల వల్ల ప్రశాంతంగా ఉన్న జిల్లాలో తిరిగి ఫ్యాక్షన్ ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. ఈనేపథ్యంలో అశాంతి నెలకొనే ప్రమాదం ఉందని ఆదోళన వ్యక్తం చేశారు. జగన్‌కు మతిస్థిమితం లేకనే ముఖ్యమంత్రి ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. జగన్ నోరు అదుపులో ఉంచుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. వైకాపా ఎమ్మెల్యేలు టిడిపిలోకి చేరుతుండటంతో అసహనానికి గురవుతున్నట్లు తెలిపారు. టిడిపితోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ఈ విషయాన్ని గమణించే ఎమ్మెల్యేలు, ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. తన తప్పులను కప్పి పుచ్చుకోవడానికి జగన్ సిఎంపై వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.