అనంతపురం

పంపనూరులో లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, మార్చి 17 : మండల పరిధిలోని పంపనూరు సమీపాన పి.యాలేరు గ్రామ పరిధిలోని కొండపై వెలిసిన శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి బ్రహ్మోత్సవాలకు గురువారం అంకురార్పణ జరిగింది. స్వామివారికి సంబంధించిన ఉత్సవ విగ్రహాలను ప్రతి యేటా బ్రహ్మోత్సవాల సమయంలో వై.కొత్తపల్లి ఆలయం నుంచి తీసుకురావడం, ఉత్సవాలు పూర్తి కాగానే ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకెళ్ళి వై.కొత్తపల్లి ఆలయంలో కొలువుదీర్చడం ఆనవాయితీగా వస్తోంది. బ్రహ్మోత్సవాల ప్రారంభం రోజైన గురువారం స్వామివారి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా పంపనూరు సమీపాన కొండపైకి తీసుకువచ్చి కలశస్థాపన, అభిషేక, ధ్వజారోహణ, రక్షాబంధన పూజలు నిర్వహించారు.