అనంతపురం

ద్విచక్ర వాహనం బోల్తా.. వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొమ్మనహాల్, జూన్ 14 : ద్విచక్ర వాహనం బోల్తా పడటంతో మండలంలోని బండూరు గ్రామానికి చెందిన బోయ రాజన్న (20) మంగళవారం మృతి చెందినట్లు ఎస్‌ఐ శ్రీరామ్ శ్రీనివాసులు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు రాజన్న బండూరు గ్రామం నుంచి పాల్తూరు వెళ్తూ కలవళ్లితిప్ప మలుపువద్ద అదుపుతప్పి బండరాయిని ఢీకొట్టి పడిపోయాడు. గమనించిన స్థానిక రైతులు గాయపడిన రాజన్నను బళ్లారికి తరలించారు. బళ్లారిలోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందినట్లు తెలిపారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.