అనంతపురం

కన్నుల పండువగా శ్రీఅవధూత ఎర్రితాత రథోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెళుగుప్ప, జూన్ 23 : మండల కేంద్రంలోని శాంతిధామంలో వెలసిన అవధూత శ్రీఎర్రితాత రథోత్సవం గురువారం రాత్రి కన్నుల పండువగా జరిగింది. ఆరాధన ఉత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. రాత్రి 8 గంటలకు స్థానిక వినాయక ఆలయం వద్ద ఆచారం ప్రకారం రథాన్ని అలంకరించి శాంతిధామం వరకు రథోత్సవాన్ని నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు.