అంతర్జాతీయం

యూపీలో మైనర్ బాలికపై అత్యాచారం.. హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈటా (ఉత్తరప్రదేశ్), ఏప్రిల్ 17: దేశాన్ని కుదిపేసిన కథువా సంఘటన మరువకముందే, ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. ఏ డేళ్ల బాలికపై అత్యాచారం జరిపి దారుణంగా హ త్య చేసిన సంఘటన ఈటాలో చోటుచేసుకుంది. సంఘటనపై ఆగ్రహించిన మృతురాలి తల్లిదండ్రులు ఈటా-్ఫరూకాబాద్ రహదారిని దిగ్బంధించి, రూ.10లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం ఈ దారుణం సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30 గంటల ప్రాంతంలో అలీగంజ్ రోడ్డులోని మండి సమితి గేటువద్ద జరిగింది. ఇక్కడ జరుగుతున్న వివాహ వేడుకకు తల్లిదండ్రులతో కలిసి బాలిక కూడా హాజరైంది. సోను జాదవ్ (19) అ నే యువకుడికి, టెంట్లు వేసే బాధ్యతను అప్పగించారు. వివాహ వేడుకకు వచ్చిన బాలికను మభ్యపెట్టిన జాదవ్ ఆమెపై అత్యాచారానికి పాల్పడి త ర్వాత హత్య చేసినట్టు ఎస్‌పీ అఖిలేశ్ చౌరాసి యా తెలిపారు. తాగిన మైకంలో ఉన్న జాదవ్ అక్కడి నుంచి పారిపోయాడని వెల్లడించారు. ఈ సంఘటన వివాహ వేడుక జరిగే ప్రదేశానికి సమీపంలో నిర్మాణంలో ఉన్న ఇంటివద్ద జరిగింది. బాలిక మెడపై తాడుతో బిగించిన గుర్తులు ఉ న్నాయని ఎస్‌పీ పేర్కొన్నారు. బాలికను జిల్లా ఆసుపత్రికి తరలించగా ఆమె అప్పటికే చనిపోయిందని డాక్టర్లు ధ్రువీకరించారు. కాగా బాలిక కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదు మేరకు సో ను యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని పై ‘పోస్కో’ చట్టం కింద కేసు నమోదు చేశారు.
సంఘటనపై కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు తీవ్రంగా స్పందించాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలను మెరుగుపరుస్తామని వాగ్దానం చేసి మరీ భాజపా అధికారంలోకి వచ్చి, పిల్లలకూ భద్రత లేని దారుణ స్థితి కొనసాగుతున్నదంటూ విరుచుకుపడ్డాయి. నేరగాళ్లను ఒక పక్క ఎన్‌కౌంటర్ చేస్తుంటే మరోపక్క నేరా లు పెరగడమేంటని ప్ర శ్నించాయి. రాష్ట్రంలో పె రుగుతున్న నేరాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేపడతామని కాంగ్రెస్ ప్రకటించింది. యూపీలో చోటుచేసుకుంటున్న అత్యాచార సంఘటనలు యోగి ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెడుతుండగా, విపక్షాల చేతిలో ఇవి బ లమైన అస్త్రాలుగా రూపొందుతున్నాయి. ప శ్చి మ ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావోలో టీనేజ్ బాలిక పై, భాజపా ఎమ్మెల్యే అత్యాచారం జరిపాడం టూ వచ్చిన ఆరోపణల తుపానులో సతమతమవుతున్న ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి, తాజాగా ఈ టా సంఘటన పెద్ద తలనొప్పిగా మారింది.