అంతర్జాతీయం

మిస్సోరి సరస్సులో నావ మునక -- 17మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూలై 20: మిస్సోరిలో ఒక సరస్సులో ఆకస్మికంగా వచ్చిన గాలి తుపాను వల్ల ఒక నావ మునిగి 17 మంది మరణించారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. ప్రమాదం సంభవించిన సమయంలో నావలో 31 మంది ప్రయాణీకులు ఉన్నారు. ఈ నావ ఆంఫీబియస్ టెక్నాలజీతో తయారు చేశారు. భూమి మీద మోటారులాగా డ్రైవ్ చేయవచ్చు. నీటిలో తేలుతూ వెళుతుంది. మరణించిన వారిలో పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. ఏడుగురిని ఆస్పత్రిలో చేర్పించారు. పెనుగాలులు, భారీ వర్షం వల్ల నావ మునిగిందని స్థానిక అధికారి డగ్ రాడర్ చెప్పారు. ఈ సమయంలో మరో రెండు నావలు కూడా సరస్సులో ఉన్నాయి. ఈ సరస్సును పర్యాటకుల నిమిత్తం తవ్వి ఏర్పాటు చేశారు. స్థానిక కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 6.15 గంటలకు ఈ ఘటన జరిగింది. గంటకు 119 కి.మీ వేగంతో పెనుగాలులు వీచాయని వాతావరణ శాస్తవ్రేత్తలు చెప్పారు.