ఆంధ్రప్రదేశ్‌

అగ్రిగోల్డ్ కేసులో సిఐడి వైఫల్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులను స్వాధీన పరచుకోవడంలో సిఐడి అధికారులు విఫలమయ్యారని, వారు తీవ్ర జాప్యం చేసినందున నిందితులు ఆస్తులను అమ్మేసుకున్నారని బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు అన్నారు. ఆయన గురువారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ, అగ్రిగోల్డ్ కేసుపై అసెంబ్లీలో మాట్లాడేందుకు తమకు తగినంతగా అవకాశం ఇవ్వలేదని, అయినా బాధితులకు న్యాయం జరిగేలా తాను పోరాడతానని ఆయన ప్రకటించారు. అవసరమైతే అసెంబ్లీ వద్ద ఆందోళన చేస్తానన్నారు. ఎమ్మెల్యేలకు పెంచిన జీతభత్యాలు తక్కువేనని ఆయన వ్యాఖ్యానించారు.