ఆంధ్రప్రదేశ్‌

ధర్మపోరాట దీక్షనుంచి దృష్టి మరల్చేందుకే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 21: రాష్ట్ర ప్రయోజనాలు సాధించే క్రమంలో కేంద్రం తీరుకు నిరసనగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట దీక్ష నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ వద్ద శుక్రవారం హడావుడి సృష్టించారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కే కళావెంకటరావు ఆరోపించారు. విశాఖలో శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ పవన్ చేస్తున్న పోరు ప్రజల కోసం కాదన్నారు. చంద్రబాబు ధర్మపోరాట దీక్ష ప్రారంభిస్తారన్న సమాచారంతోనే పవన్ ట్వీట్ల యుద్ధం ప్రారంభించారన్నారు. ధర్మపోరాట దీక్షతో ప్రజల్లో కేంద్రంపై ఆక్రోశం పెరుగుతున్న తరుణంలో పవన్ కల్యాణ్ ఛానెళ్ల దృష్టి మళ్లించేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ఇదే సందర్భంలో పవన్ మీడియాపై దాడికి దిగడం, ఛానెళ్ల పనితీరును నిర్ధారించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఇక బీజేపీ రాష్ట్రానికి చేసిన అన్యాయంపై ప్రజలు భగ్గుమంటున్నారన్నారు. ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఎదురయ్యే ప్రతి స్పందనలు ఒక్కోసారి ఒక్కో విధంగా ఉంటాయన్నారు. ప్రస్తుతం ఏపీలో బీజేపీపై ప్రజల్లో పట్టరాని ఆగ్రహం నెలకొందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసే రాజకీయ పార్టీలను ప్రజలు క్షమించరన్నారు.