ఆంధ్రప్రదేశ్‌

బాబుది ఉపవాసం మాత్రమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 21: ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా దీక్ష చేయలేదని, ఉపవాసం చేశారని, ఈ దీక్ష సారాంశం ఏంటో అర్ధం కావడం లేదని వైకాపా ఎమ్మెల్యే, పిఏసి చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం ఇక్కడ ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, నాలుగేళ్ల పాలనలో అమరావతి రాజధానికి సంబంధించి ఎలాంటి పురోగతి లేదని, కేవలం ప్రచారంతో కాలం వెళ్లదీస్తున్నారన్నారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తికి పరిపాలించడం కూడా రాకపోవడం బాధాకరమన్నారు. దేశంలోనే సీనియర్‌నేత అని చెప్పుకునే చంద్రబాబుకు రాష్ట్రంలో సాధారణ పరిపాలనకూడా చేయడం రావడం లేదన్నారు. చంద్రబాబు పాలనలో అభివృద్ధి శూన్యమని, వ్యవసాయాన్ని విస్మరించారని ఎన్నికల సమయంలో ఇచ్చిన రుణమాఫీ హామీని గాలికి వదిలేశారన్నారు. మద్దతు ధర ఇస్తూ కందుల కొనుగోలు చేశారని, అందులో అవినీతి దారుణంగా చోటు చేసుకుందన్నారు. పంచాయితీ రాజ్ వ్యవస్థను బ్రష్టు పట్టించారని, భూమి పట్టాల ఆన్‌లైన్ కోసం డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. కేంద్రం హౌసింగ్ స్కీం కోసం సూచించిన నిబంధనలను ఒక్కటైనా అమలు చేస్తున్నారా , గ్రామసభను ఎక్కడైనా నిర్వహిస్తున్నారా అని ప్రశ్నించారు. శాంతి భద్రతలు చూస్తే దారుణంగా ఉందని, ప్రతి పోలీసు స్టేషన్‌లో టిడిపి నేతలు ఆజమాయిషీ చేస్తున్నారన్నారు. ప్రత్యేక హోదాపై పదే పదే మాట మార్చుతున్నారని, ప్యాకేజీకి మారి, మళ్లీ ఓట్ల కోసం హోదా డిమాండ్ అందుకున్నారన్నారు.