ఆంధ్రప్రదేశ్‌

607 నాటు తుపాకులు ధ్వంసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, ఏప్రిల్ 23: జిల్లాలో వివిధ కేసుల కింద స్వాధీనం చేసుకుని పోలీసుస్టేషన్లలో శిథిలావస్థకు చేరుకున్న 607 నాటు తుపాకులను సోమవారం చిత్తూరులోని పోలీస్ మైదానంలో పోలీస్ అధికారులు రోడ్డు రోల్లరుతో తొక్కించి ధ్వంసం చేశారు. జిల్లాలో 1972 నుంచి 1989 వరకు సుమారు 18 సంవత్సరాల పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న ఈ నాటు తుపాకులను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కోర్టు ఉత్తర్వులు అనంతరం వీటిని ధ్వంసం చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. పట్టుబడ్డ తుపాకులు శిథిలావస్థకు చేరుకోవడంతో వీటిని ధ్వంసం చేయాలని నిర్ణయానికి వచ్చి అనంతపురం రేంజ్ డీఐజీ ప్రభాకర్‌రావు, చిత్తూరు ఆర్‌డీవో కోదండరామిరెడ్డి సమక్షంలో వీటిని ధ్వంసం చేసినట్లు ఎస్పీ వివరించారు.

చిత్రం..చిత్తూరు పోలీస్ మైదానంలో నాటు తుపాకులను ధ్వంసం చేస్తున్న దృశ్యం