ఆంధ్రప్రదేశ్‌

రాజధాని అమరావతి ప్రాంతంలో రూ. 494కోట్లతో వెయ్యి అపార్ట్‌మెంట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 25: అమరావతిలో వివిధ సంస్థల్లో పనిచేసే ప్రైవేట్ ఉద్యోగులతో పాటు ఇతరుల కోసం రూ. 494 కోట్ల వ్యయంతో 1000 అపార్ట్‌మెంట్లు నిర్మించనున్నామని, వాటిని వేలం ద్వారా విక్రయించనున్నామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పీ నారాయణ వెల్లడించారు. ఈ అపార్ట్‌మెంట్లను మూడు కేటగిరీల్లో నిర్మించనున్నామన్నారు. రాష్ట్రంలో 71 మున్సిపార్టీల్లో 203 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నట్లు కూడా వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో బుధవారం నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఉద్యోగుల కోసం చేపట్టిన అపార్ట్‌మెంట్ల నిర్మాణాల ప్రగతిపై సీఎం సమీక్షించారన్నారు. నిర్దేశించిన కాలంలోగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారన్నారు. రాజధాని భూసేకరణలో భాగంగా ల్యాండ్ పూలింగ్ కింద మిగిలిన 1500 ఎకరాల సేకరణపై చర్చ జరిగినట్లు మంత్రి నారాయణ తెలిపారు. సిటీ కోర్టు నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తున్నామన్నారు. కోర్టులు అమరావతికి మార్చిన తరువాత వచ్చే ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగుల కోసం అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి అనుమతులిచ్చారన్నారు. ఏడాదిలోగా ఈ నిర్మాణాలు పూర్తిచేయాలనే ఉద్దేశంతో త్వరలో టెండర్లు పిలవడానికి సీఆర్డీఏ చర్యలు చేపట్టిందన్నారు. జీ ప్లస్-11 పద్ధతిలో చేపట్టే ఈ అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి ప్రభుత్వం 10 ఎకరాల భూమి కేటాయించిందన్నారు. వేలం పద్ధతిలో అపార్ట్‌మెంట్లు విక్రయిచాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. వీటికి ప్రజల నుంచి వచ్చిన స్పందనను బట్టి మరిన్ని అపార్ట్‌మెంట్ల నిర్మాణం చేపడతామన్నారు. 1200 చదరపు అడుగుల్లో 500ల అపార్ట్‌మెంట్లు, 1500 అదనపు అడుగుల్లో 300, 1800 చదరపు అడుగుల్లో 200, ఇలా మూడు కేటగిరీల్లో రాజధాని ప్రాంతంలో నిర్మించనున్నామన్నారు. నో లాస్, నో ప్రాఫిట్ విధానంలో ఈ అపార్ట్‌మెంట్లను చదరపు అడుగు రూ. 3500లకు విక్రయించనున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో మొదటి విడతగా 71 మున్సిపాల్టీల్లో 203 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. టిఫిన్, లంచ్, డిన్నర్ ఉంటాయన్నారు. లంచ్, డిన్నర్ ఖరీదు 5 రూపాయలని మంత్రి తెలిపారు. బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ, పొంగల్, ఉప్మా ఉంటాయన్నారు. ఇడ్లీ రేటు రూపాయి అని తెలిపారు. అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు ఇప్పటికే స్థలాలు గుర్తించామని మంత్రి నారాయణ వివరించారు.

చిత్రం..విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతున్న నారాయణ