ఆంధ్రప్రదేశ్‌

ఎలుగుబంటి దాడిలో గిరిజనుడికి గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మారేడుమిల్లి, ఏప్రిల్ 25: తోటలో జీడి గింజలు సేకరించడానికి వెళ్లిన గిరిజనుడిపై ఎలుగుబంటి దాడిచేసి, తీవ్రంగా గాయపరిచింది. తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతం మారేడుమిల్లి గ్రామం ధారవాడలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మారేడుమిల్లి మండలం ధారవాడ గ్రామానికి చెందిన పల్లాల సోమిరెడ్డి (35) బుధవారం ఉదయం తన తోటలో జీడిమామిడి గింజలు సేకరించడానికి వెళ్లాడు. అదే సమయంలో రెండు పిల్లలు గల ఎలుగుబంటి సోమిరెడ్డిపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది. దీంతో సోమిరెడ్డి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. చుట్టుపక్కల గిరిజనులు దీన్ని గమనించి బిగ్గరగా కేకలు వేయడంతో ఎలుగుబంటి పారిపోయింది. బాధితుడిని 108 అంబులెన్సులో రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. సోమిరెడ్డి పరిస్థితి విషమించడంతో జిల్లా కేంద్రం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.