ఆంధ్రప్రదేశ్‌

అభివృద్ధి కోసం పోరాడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ(జగదాంబ), మే 17: రాష్ట్రంలో అధికారం సాధించడం కోసం ఎవరి పార్టీ తరపున వారు పాదయాత్రలు, బస్‌యాత్రలు నిర్వహించుకుంటున్నారని ఆ మాదిరిగానే రాష్ట్ర ప్రయోజనాల కోసం కూడా పోరాడాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. విశాఖలో ఈ నెల 22న ఏయూ వేదికగా నిర్వహించే ధర్మపోరాట దీక్ష కార్యక్రమం ఏర్పాట్లను గురువారం మంత్రి గంటా శ్రీనివాసరావు, జిల్లా, నగర పార్టీ అధ్యక్షులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం చేపడుతున్న పోరాటాలలో పాల్గొనాలని, రాజధాని అభివృద్ధి, ప్రాజెక్టు నిర్మాణాలలో కావాలనే వైసీపీ నాయకులు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. కేవలం ఏపీ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. లక్షమంది తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని పోలీస్ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షుడు వాసుపల్లి గణేష్‌కుమార్, ఎమ్మెల్మేలు పీలా గోవింద సత్యనారాయణ, వంగలపూడి అనిత, గిడ్డి ఈశ్వరి, పోలీస్ కమిషనర్ టి.యోగానంద్ పాల్గొన్నారు.

చిత్రం..ధర్మపోరాట దీక్ష సభ ఏర్పాట్లు పర్యవేక్షిసున్న మంత్రులు రాజప్ప, గంటా