ఆంధ్రప్రదేశ్‌

పీఆర్సీ నియామకం పట్ల జేఏసీ అమరావతి హర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 18: పది లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్లకు ప్రయోజనాలను చేకూర్చేలా ప్రభుత్వం 11వ వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ)ను నియమిస్తూ శుక్రవారం జీవో జారీ చేసింది. దీనిపై ఏపీ జెఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు సంతోషం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పీఆర్సీ కమిషనర్‌ని కూడా ఆలస్యం కాకుండా వెంటనే నియమించాలని, ఉద్యోగులకు భవిష్యత్తులో నష్టం జరగకుండా ఉండాలంటే 11వ వేతన సవరణను జూలై 2018 నుండి అమల్లోకి వచ్చేటట్లు చర్యలు తీసుకోవాలని కోరారు.