ఆంధ్రప్రదేశ్‌

త్వరితగతిన అర్బన్ హౌసింగ్ గృహ నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 18: రాష్ట్రంలో జవహర్‌లాల్ నెహ్రూ జాతీయ అర్బన్ రెన్యువల్ మిషన్‌లో భాగంగా బీఎస్‌యూపీ, ఐహెచ్‌ఎస్డీపీ ప్రాజెక్టుల కింద మంజూరైన అర్బన్ హౌసింగ్ గృహాలన్నిటినీ త్వరగా పూర్తిచేయాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) దినేష్‌కుమార్ ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలోని తన కార్యాలయంలో పారిశ్రామిక కార్మికులకు గృహవసతి, జవహర్‌లాల్ నెహ్రూ జాతీయ అర్బన్ రెన్యువల్ మిషన్ కింద బీఎస్‌యూపీ, ఐహెచ్‌ఎస్డీపీ ప్రాజెక్టుల కింద మంజూరైన గృహాలపై ఆయన కార్మిక, పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖల అధికారులతో శుక్రవారం సమీక్షించారు. తొలుత పారిశ్రామిక కార్మికులకు గృహ వసతికి సంబంధించిన అంశంపై కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ వివరిస్తూ రాష్ట్రంలో కార్మిక సంక్షేమ బోర్డు కింద ప్రస్తుతం 14లక్షల మంది వరకూ కార్మికులు రిజిష్టర్ అయి ఉన్నారని, వారు చెల్లించిన కార్మిక సెస్ నిధుల నుండి కొంత మొత్తాన్ని సబ్సిడీగా చెల్లించి వారికి ఇళ్ల నిర్మాణ పథకం అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉందని తెలిపారు. దానిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ స్పందించి మాట్లాడుతూ ఆ కార్మికుల ఆధార్ నంబరుతో సహా వివరాలను మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ అధికారులకు అందిస్తే వారు పరిశీలించి ఎంతమందికి ఇళ్ల నిర్మాణానికి సబ్సిడీ అవసరం ఉంటుందనేది పరిశీలించి చర్యలు తీసుకుంటారని అన్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద నమోదై 50 రోజులకు పైగా పనిచేసిన కార్మికులు, కార్మిక బోర్డు కింద రిజిష్టర్ కాకుండా ఉన్న వారిని కూడా రిజిష్టర్ చేసి వారికి కూడా ఈ విధంగా గృహ నిర్మాణానికి తోడ్పాటును అందించాల్సి ఉందని అన్నారు. ఇందుకు గాను వెంటనే ప్రత్యేక సర్వే నిర్వహించాలని అలాంటి వారిని గుర్తించి వెంటనే రిజిష్టర్ చేయాలని కార్మికశాఖ అధికారులను సీఎస్ ఆదేశించారు. జవహర్‌లాల్ నెహ్రూ జాతీయ అర్బన్ రెన్యువల్ మిషన్‌లో భాగంగా బీఎస్‌యూపీ, ఐహెచ్‌ఎస్డీపీ పథకాల కింద మంజూరైన గృహాలపై మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కరికల వలవన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ వివిధ పట్టణాల్లో మంజూరైన ఇళ్లు వాటి ప్రగతిని వివరించారు. రాష్ట్రంలో 10 నగరాలు, పట్టణాల్లో చేపట్టిన రాజీవ్ స్వగృహ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేసేందుకు ఒక యువ అధికారికి ప్రత్యేకంగా బాధ్యతలు ఇవ్వాలని ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టు కింద వివిధ పట్టణాల్లో చేపట్టిన ఇళ్లు త్వరగా పూర్తిచేసి వాటిని విక్రయించడం ద్వారా త్వరితగతిన ప్రాజెక్టును పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇందుకు కేటాయించిన భూములు అన్యాక్రాంతం కాకుండా చూసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సీఎస్ ఆదేశించారు.