ఆంధ్రప్రదేశ్‌

పెద్ద్భిట్ల మృతిపై సీఎం సంతాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 18: ప్రఖ్యాత కథా రచయిత పెద్ద్భిట్ల సుబ్బరామయ్య మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. 40ఏళ్ల పాటు అధ్యాపకుడిగా పనిచేస్తూనే సాహితీ రంగంలో తనదైన ముద్రతో శిఖరాగ్ర స్థాయికి ఎదిగారని, తెలుగులో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొంది తెలుగువారికి గర్వకారణంగా నిలిచారని సీఎం శ్లాఘించారు. రెండొందలకు పైగా కథలు రాసిన పెద్ద్భిట్ల మృతి తెలుగు సాహిత్య రంగానికి తీరని లోటుగా తెలిపారు. ప్రముఖ కథా రచయిత పెద్ద్భిట్ల సుబ్బరామయ్య మృతికి ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్ విచారం వ్యక్తం చేశారు. సుబ్బరామయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉత్తమ కథలు ఎన్నో అందించి మరెన్నో పురస్కారాలను, ప్రజల హృదయాలను గెలుచుకున్న పెద్ద్భిట్ల సాహితీ రంగంలో ధ్రువతారగా నిలిచిపోతారని నివాళులర్పించారు.