ఆంధ్రప్రదేశ్
టీడీపీ ఆదాయం రూ. 19.4 కోట్లు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 28 May 2018
విజయవాడ, మే 27: గడచిన ఆర్థిక సంవత్సరంలో తెలుగుదేశం పార్టీకి వివిధ పద్దుల కింద రూ. 19.4 కోట్ల మేరకు ఆదాయం లభించింది. మహానాడులో భాగంగా ఆ పార్టీ కోశాధికారి, మంత్రి శిద్దా రాఘవరావు ఆదాయ, వ్యయాల వివరాలను వెల్లడించారు. సభ్యత్వ నమోదు కింద 11.2 కోట్ల రూపాయలు, వడ్డీ, తదితర పద్దుల కింద 8.6 కోట్ల రూపాయలు లభించాయని తెలిపారు. కాగా ప్రచారం కోసం 6.38 కోట్ల రూపాయలు, ఆఫీసుల అద్దె కింద 1.28 కోట్లు, ఆఫీసు ఖర్చుల కింద 1.91 కోట్లు, ఉద్యోగుల జీతభత్యాల కింద 1.73 కోట్లు, కార్యకర్తల బీమా కోసం 3.5 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. పార్టీకి 104 కోట్ల రూపాయల మేర విలువైన ఆస్తులున్నట్లు శిద్దా వివరించారు.