ఆంధ్రప్రదేశ్
మద్యం మత్తులో ఉద్యోగుల హల్చల్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 28 May 2018
భద్రాచలం టౌన్, మే 27: విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది కార్యాలయంలోనే మద్యం తాగి వాచ్మెన్పై దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. స్థానిక పట్టుపరిశ్రమల శాఖ కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగులు శనివారం మద్యం తాగారు. వాచ్మెన్ వీరిని గమనించకుండా గేటు తాళం వేశాడు. దీంతో కోపోద్రిక్తులైన ఇద్దరు ఉద్యోగులు మద్యం మత్తులో వాచ్మెన్పై దౌర్జన్యం చేసి చంపేస్తామంటూ ఒంటిపై పెట్రోల్ పోశారు. ఇంతటితో ఆగని వారు అతన్ని కార్యాలయంలోనే నిర్బంధించి గేటుకు తాళం వేసి వెళ్లిపోయారు. జరిగిన విషయంపై వాచ్మెన్ ఫిర్యాదు చేయడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా పట్టుపరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ అనసూయ విచారణకు ఆదేశించారు.