ఆంధ్రప్రదేశ్‌

ఐఏఎస్‌ల బదిలీల్లో స్వల్ప మార్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 27: ఇటీవల జరిగిన ఐఏఎస్ అధికారుల బదిలీల్లో కొన్ని మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ఎస్సీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీగా విజయకుమార్‌ను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అక్కడ పనిచేస్తున్న వివేక్ యాదవ్‌ను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీగా నియమించింది. సర్వే సెటిల్‌మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్‌గా ఎన్ ప్రభాకరరెడ్డిని, ఏపీ స్టేట్ ఫైబర్నెట్ కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలను కూడా బాబు అహ్మద్‌కు అప్పగించింది. ఆ పదవిలో ఉన్న ఏఎస్ దినేష్‌కుమార్‌ను ఏపీ స్టేట్ ఫైబర్నెట్ కార్పొరేషన్ ఎండీగా నియమించింది. జైళ్ల శాఖ డీఐజీ ఎం వరప్రసాద్‌ను సీడాప్ ఎండీగా నియమించింది.