ఆంధ్రప్రదేశ్
9 నగరాల కాంప్రెహెన్సిల్ మొబిలిటీ ప్లాన్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 10 July 2018
విజయవాడ, జూలై 10: రాష్ట్రంలో విశాఖ సహా 9 నగరాల్లో కాంప్రెహెన్సిల్ మొబిలిటీ ప్లాన్ తయారీని పర్యవేక్షించేందుకు ఒక కమిటీని ప్రభుత్వం మంగళవారం నియమించింది. మానిటరింగ్ కమ్ అడ్వయిజరీ కమిటీగా దీనిని వ్యవహరిస్తారు. మొబిలిటీ ప్లాన్ తయారీని పర్యవేక్షించేందుకు వీలుగా నియమించిన కమిటీకి పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని చైర్మన్గా వ్యవహరిస్తారు. సభ్యులుగా ఆయా జిల్లాల కలెక్టర్లు, మేయర్లు/మున్సిపల్ చైర్మన్లు, ఆర్టీసీ ఆర్ఎంలు, సిటీ ప్లానర్లు, కేంద్ర ప్రభుత్వ నామినీ ఉంటారు. ఏఎంఆర్సీఎల్ ఎండీ నోడల్ అధికారిగా, కన్సల్టెంట్ మెంబర్ కన్వీనర్గా వ్యవహరిస్తారు.