ఆంధ్రప్రదేశ్‌

అన్న క్యాంటీన్లకు విరాళాల వెల్లువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 12: రాష్ట్రంలో అన్న క్యాంటీన్ల నిర్వహణకు టీడీపీ వర్కుషాపులో విశేష స్పందన లభించింది. ఉండవల్లిలో సీఎం నివాసంలో జరిగిన గురువారం జరిగిన టీడీపీ వర్కుషాపులో ఆ పార్టీ నేతలు పోటీ పడి విరాళాలు ప్రకటించారు. ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, ఇన్‌చార్జి తమ పుట్టిన రోజును పురస్కరించుకుని లక్ష రూపాయలకు తగ్గకుండా విరాళం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు ఇచ్చారు. అన్న క్యాంటీన్ నిర్వహణకు ప్రతి ఒక్కరూ విరాళం ఇవ్వడం ద్వారా 10 మందికి భోజనం పెట్టామన్న సంతృప్తి పొందాలన్నారు. ఈ మేరకు అన్న క్యాంటీన్ సొసైటీకి చాలా మంది విరాళాలను అందచేశారు. కొంతమంది తమ కుటుంబ సభ్యుల పుట్టిన రోజు, ఇతర శుభ కార్యాల సందర్భంగా లక్ష రూపాయలు విరాళం ఇవ్వనున్నట్లు ప్రకటించారు.