ఆంధ్రప్రదేశ్‌

ప్రభుత్వ ఉద్యోగుల సామూహిక సెలవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జూలై 13 : నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్‌రెడ్డి కలెక్టర్ ముత్యాలరాజుపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జిల్లా అధికారుల సంఘం నాయకుల పిలుపు మేరకు శుక్రవారం ప్రభుత్వ అధికారులు, సిబ్బంది సామూహిక సెలవుపై వెళ్లారు. కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేసి విధులకు గైర్హాజరైయ్యారు. అయితే పలు సంఘాల నాయకులు మాత్రం జిల్లా అధికారుల సంఘం నాయకులు ఇచ్చిన పిలుపును పక్కన పెట్టి విధులకు హాజరైయ్యారు. మండల స్థాయి అధికారులు మాత్రం యధావిధిగా కార్యాలయాలకు వెళ్లి విధులు నిర్వహించారు. మొత్తం మీద కలెక్టర్‌కు మద్దతు తెలిపేందుకు జిల్లా అధికారులు పిలుపు మేరకు 50శాతం మంది ఉద్యోగులు మాత్రమే విధులకు గైర్హాజరైయ్యారు. పలు ఉద్యోగ సంఘాల నాయకులు, అధికారులు, సిబ్బంది విధులకు హాజరుకావడంతో జిల్లాలో చర్చాంశనీయంగా మారింది. కాకాణి గోవర్దన్‌రెడ్డి చేసిన ఆరోపణల్లో న్యాయం ఉండబట్టే కదా అధికారులు విధులకు హాజరీయ్యారంటూ గుసగుసలు వినబడుతున్నాయి. కొందరు రాజకీయ నాయకులు అధికారులను పావులుగా వాడుకుంటున్నారని చెప్పుకుంటున్నారు.