ఆంధ్రప్రదేశ్
కొనసాగుతున్న ద్రోణి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 14 July 2018
విశాఖపట్నం, జూలై 13: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా నైరుతి దిశలో 7.6 కిమీ ఎత్తున ఉపరితల ఆవర్తనం నెలకొందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు శుక్రవారం రాత్రి తెలిపారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జల్లులు, ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ద్రోణి, ఆవర్తన ప్రభావంతో సముద్రం కొంతమేర కల్లోలంగా ఉంటుందని, తీరం వెంబడి పశ్చిమ దిశలో గంటకు 45 నుంచి 50 కిమీ మేర గాలులు వీస్తాయన్నారు. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.