ఆంధ్రప్రదేశ్‌

కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 14: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం 7.6 కిమీ ఎత్తున స్థిరంగా ఉంది. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమ సహా తెలంగాణ జిల్లాల్లో పలు చోట్ల ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని పేర్కొన్నారు. తీరం వెంబడి ఉత్తర కోస్తాలో పశ్చిమ దిశ నుంచి గంటకు 45 నుంచి 50 కిమీ వేగంతోను, దక్షిణ కోస్తాలో 50 నుంచి 55 కిమీ వేగంతోనూ బలమైన గాలులు వీస్తాయన్నారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకూ నెల్లూరు జిల్లా తడ 5 సెంమీ, నెల్లూరు 4 సెంమీ, చింతూరు, ఇచ్ఛాపు, వేలరిపేటలో 3 సెంమీ వర్షపాతం నమోదైంది.