ఆంధ్రప్రదేశ్‌

ఉత్తరాంధ్రకు ఊమెన్ చాందీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 15: ఉత్తరాంధ్ర జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఉమెన్ చాందీ మూడు రోజులపాటు పర్యటించనున్నారు.
ఈ నెల 16న శ్రీకాకుళం, 17న విజయనగరం, 18,19 తేదీల్లో విశాఖ జిల్లాల్లో పర్యటించి కాంగ్రెస్ కార్యకర్తలతో సంప్రదించనున్నారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి క్రిష్ట్ఫోర్ తిలక్ తెలిపారు.
నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాయకులు కాంగ్రెస్‌ను వీడినప్పటికీ కార్యకర్తలంతా కాంగ్రెస్‌లోనే ఉన్నారన్నారు. సంస్థాగతంగా బలమైన కాంగ్రెస్‌కు బూత్ స్థాయిలో బలమైన క్యాడర్ ఉందని, రాబోయే ఎన్నికలను దృష్టిలోపెట్టుకుని కాంగ్రెస్‌ను పూర్తిస్థాయిలో బలోపేతం చేసే దిశగా నాయకత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదాతో సహా విభజన హామీలు అన్నీ అమలు చేసే సత్తా కాంగ్రెస్‌కే ఉందన్నారు. విలేఖరుల సమావేశంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు శ్రీనివాస్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు బెహరా భాస్కరరావు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న క్రిష్ట్ఫోర్ తిలక్