జాతీయ వార్తలు

తూర్పు నౌకాదళాన్ని సందర్శించిన నేవీ చీఫ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 11: నౌకాదళ ప్రధానాధికారి సునీల్ లాంబ తూర్పు నౌకాదళాన్ని సోమవారం సందర్శించారు. నౌకాదళ ప్రధానాధికారికి ఇఎన్‌సి చీఫ్ హెచ్‌సిఎస్ బిస్త్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇఎన్‌సి స్ట్ఫా నుంచి నేవీ చీఫ్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన తూర్పునౌకాదళంలోని పలు విభాగాలను సందర్శించారు. ఈ సందర్భంగా లాంబ మాట్లాడుతూ తూర్పుతీరంలో నౌకాదళం సేవలను కొనియాడారు. బంగాళాఖాతం, దక్షిణాసియా తీరాల్లో తూర్పు నౌకాదళం అందిస్తున్న సేవలు, ముఖ్యంగా నౌకాదళ సంబంధాల విషయంలో చూపుతున్న చొరవను ఆయన ప్రశంసించారు.