ఆంధ్రప్రదేశ్‌

సర్వీస్ లేని 32 విమానాశ్రయాలపై దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొబ్బిలి(రూరల్), జూలై 14: ఏమాత్రం సర్వీస్ లేని 32 విమానాశ్రయాలపై దృష్టి సారించామని కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు పేర్కొన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలికి గురువారం వచ్చిన ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ అందరికీ అందుబాటులో ఉండే విధంగా విమాన టికెట్ల ధరలను ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. 2వేల 500 రూపాయలతో విమానం ఎక్కే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. రాష్ట్రంలో విజయనగరం జిల్లా సోలార్ పంప్‌సెట్ల ఏర్పాటులో ప్రధమ స్థానంలో నిలిచిందన్నారు. ప్రతీ రైతు సోలార్‌పంపుసెట్లను వినియోగించే విధంగా అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్ర వినజన వల్ల ఎన్నో సమస్యలు నెలకొన్నాయని, పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు.