ఆంధ్రప్రదేశ్‌

మలుపు తిరుగుతున్న రాష్ట్ర రాజకీయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరపతి, నవంబర్ 19: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎంతో వేగంగా మలుపు తిరుగుతున్నాయని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. ఇందిరమ్మ జయంతిని పురస్కరించుకుని తిరుపతి గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు చెడ్డీ ఊడిపోతోందని తాను గతంలో విమర్శించానని, ఆయన తెలివివల్ల కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలిసి మహా కూటమికి శ్రీకారం చుట్టి ఊడిపోతున్న చెడ్డీకి బెల్ట్ బిగించుకున్నాడని ఆయన చమత్కరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ చడ్డీ ఊడిపోతోందన్నారు. ఎన్‌ఆర్‌ఐలతో భారతదేశం నడుస్తోందని చెప్పారు. 420 బిలియన్ కోట్ల డాలర్లు ఎన్‌ఆర్‌ఐలు భారతదేశంలో పెట్టుబడులు పెట్టారన్నారు. ఇటీవల 20 బిలియన్ కోట్ల డాలర్లు వెనక్కి తీసుకున్నారని, తక్కినమొత్తాన్ని వెనెక్కి తీసుకుంటే దేశం ఆర్థిక సంక్షోభంలో పడటం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.