ఆంధ్రప్రదేశ్‌

బాలికతో మహిళ వివాహం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాజువాక, జూలై 16: మాయ మాటలు చెప్పి మైనర్ బాలికను మరో మహిళ వివాహం చేసుకున్న సంఘటన గాజువాకలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మైనర్ బాలిక తల్లిదండ్రులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జాలారిపేట గ్రామానికి చెందిన కె.ఎలమాజీ అలియాస్ తేజ అనే మహిళ మూడు నెలల క్రితం పెదగంట్యాడ మండలం కొత్త దిబ్బపాలెం వచ్చింది.
ఆమె ఆన్‌లైన్ బిజినెస్ చేస్తూ ద్విచక్ర వాహనంపై గాజువాక పరిసర ప్రాంతాల్లో తిరుగుతుండేది. ఈ నేపథ్యంలో గాజువాకలో ఒక దుస్తుల దుకాణంలో పని చేస్తున్న 16 ఏళ్ల మైనర్ బాలికతో తేజ పరిచయం పెంచుకుంది. రోజూ ఆ బాలికను తేజ తన బండిపై తీసుకు వెళ్లడం, తీసుకు రావడం చేసేది. పది రోజుల క్రితం మైనర్ బాలికను తేజ ఎవరికీ చెప్పకుండా విజయవాడ, తిరుపతి తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలియని ఆ బాలిక తల్లిదండ్రులు తమ కుమార్తె కోసం గాలిస్తూ తిండికి, నిద్రకు దూరమయ్యారు. ఈ తరుణంలో మైనర్ బాలిక తమ్ముడికి తేజ ఫోన్ నెంబర్ దొరకడంతో ఆ కుర్రాడు ఫోన్ చేసి అమ్మానాన్న ఆరోగ్యం బాగోలేదని, ఇంటిలో తినడానికి తిండి లేదని, నీ కోసం ఎదురు చూస్తున్నారని చెప్పాడు. దీంతో ఆ బాలిక రెండ్రోజుల్లో గాజువాక వస్తానని, అప్పుడు ఫోన్ చేస్తానని, తన వద్దకు వస్తే డబ్బులు ఇస్తానని చెప్పినట్లు మైనర్ బాలిక తమ్ముడు తెలిపారు.
దీంట్లో భాగంగా శనివారం గాజువాక చేరుకున్న మైనర్ బాలిక, తేజ బీసీ రోడ్డులో గల నీటి ఏనుగు విగ్రహం వద్దకు వచ్చి తన తమ్ముడికి ఫోన్ చేసింది. అప్పటికే మాటు వేసు ఉన్న మైనర్ బాలిక కుటుంబీకులు తేజను పట్టుకుని దేహశుద్ది చేసి గాజువాక పోలీసులకు అప్పగించారు. అయితే తేజ మాత్రం తామిద్దరమూ తిరుపతిలో వివా హం చేసుకున్నట్లు పేర్కొంది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సిఐ ఇమ్మానే్యయల్ రాజు తేజపై కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చిత్రాలు.. మీడియాతో మాట్లాడుతున్న మైనర్ బాలిక, తేజను నిలదీస్తున్న స్థానిక మహిళలు