ఆంధ్రప్రదేశ్‌

చంద్రబాబు వల్ల ఎన్టీఆర్ కుటుంబానికి నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, డిసెంబర్ 14: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వల్ల ఎన్టీ రామారావు కుటుంబం మరోసారి మోసపోయిందని వైసీపీ మహిళా నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి స్పష్టం చేశారు. వైసీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఓడిపోవడం ఖాయమని తెలిసి కూడా నందమూరి సుహాసిని చేత పోటీ చేయించడం వెనుక నందమూరి కుటుంబానికి నష్టం కలిగించడమే చంద్రబాబు ఉద్దేశ్యమని ఆరోపించారు. తెలంగాణలో అవినీతి సొమ్ముతో ప్రజలను కొనాలనుకున్నారని, అయితే ఓటర్లు మాత్రం దిమ్మతిరిగేలా తీర్పిచ్చారని హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఓటర్లు చంద్రబాబునాయుడిని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లం వెల్లడించిన వివరాలతో ప్రజలు విస్తుపోతున్నారని ఆమె తెలిపారు. సోనియాగాంధీని ఇటలీ దెయ్యంగా అభివర్ణించిన చంద్రబాబు ఆమెను నేడు దేవతగా భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ ప్రభుత్వంలో దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. రాజధాని, నీటి ప్రాజెక్టుల్లో భారీ అవినీతి జరుగుతోందని ఆమె పేర్కొన్నారు. ప్రతి పథకంలోనూ టీడీపీ నేతలు, కార్యకర్తలు అక్రమాలకు పాల్పడుతున్నారని, ఎమ్మెల్యేల అక్రమాలకు అడ్డుఅదుపూ లేకుండా పోయిందని మండిపడ్డారు. టీడీపీ నేతల అవినీతి బట్టబయలవుతోందన్నారు. సుజనాచౌదరి, సీఎం రమేష్ భాగోతం తెలిసిందనీ, త్వరలోనే చంద్రబాబు, లోకేష్‌ల బండారం కూడా వెలుగులోకి వస్తుందని జోస్యం చెప్పారు.