ఆంధ్రప్రదేశ్‌

సీఎం మేనల్లుడు ఉదయ్‌కుమార్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చంద్రగిరి/రేణిగుంట, డిసెంబర్ 14: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మేనల్లుడు కనుమూరి ఉదయ్‌కుమార్ గుండెపోటుతో హైదరాబాదులో శుక్రవారం కన్నుమూశారు. శుక్రవారం సాయంత్రం ఉదయ్‌కుమార్ మృతదేహం మండలంలోని కందులవారిపల్లికి చేరుకుంది. దీంతో పలువురు ప్రముఖులు, బంధువులు ఉదయ్ మృతదేహానికి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. శనివారం జరగనున్న ఉదయ్‌కుమార్ అంత్యక్రియలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరు కానుండటంతో జిల్లా అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రగిరి మండలం కందులవారిపల్లికి చెందిన కనుమూరి చంద్రబాబునాయుడు, హైమావతి దంపతుల కుమారుడు ఉదయ్‌కుమార్.
ఆయన శుక్రవారం హైదరాబాదులోని కేర్ ఆసుపత్రిలో గుండెపోటుతో మృతి చెందారు. ఆయనకు భార్య సింధూర, కుమార్తె వన్షిక ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు హైమావతి రెండవ సోదరి. ఉదయ్‌కుమార్ హైదరాబాదులోని కేసీబీఎన్ ఇన్‌ఫ్రా ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నిర్వహిస్తున్నాడు. శనివారం జరగనున్న ఉదయ్‌కుమార్ అంత్యక్రియలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరుకానున్నారని కందులవారిపల్లి మాజీ సర్పంచ్ పాశం చంద్రకుమార్‌నాయుడు తెలిపారు.
ఇదిలావుండగా హైదరాబాద్‌లో గుండెపోటుతో మృతి చెందిన ఉదయ్‌కుమార్ మృతదేహాన్ని శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి స్పైస్‌జెట్ విమానంలో రేణిగుంట విమానాశ్రయంకు తరలించారు. పార్ధివదేహంతో పాటు ముఖ్యమంత్రి సతీమణి భువనేశ్వరి, కోడలు నారా బ్రహ్మణి వచ్చారు. మృతదేహాన్ని ఆంబులెన్స్ ద్వారా రోడ్డు మార్గాన నారావారి పల్లికి తీసుకెళ్లారు.