ఆంధ్రప్రదేశ్‌

జగన్ పార్టీ స్వీట్లు పంచడం విడ్డూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 14: ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ గెలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో జగన్ పార్టీ వాళ్లు స్వీట్లు పంచడం, బాణాసంచా కాల్చడం విడ్డూరమంటూ పీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ నర్రెడ్డి తులసిరీడ్డి ఎద్దేవా చేశారు. ఆంధ్రరత్న భవన్‌లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో తులసిరెడ్డి మాట్లాడుతూ ఇది ఉన్మాద ఆనందం, పైశాచిక ఆనందమని ధ్వజమెత్తారు.
ఆంధ్రప్రదేశ్‌కు సంజీవని లాంటి ప్రత్యేక హోదా రాకుండా టీఆర్‌ఎస్ పార్టీ అడ్డుపడుతున్నందుకా ఈ ఉన్మాద ఆనందం.. నీటి కేటాయింపులు, అనుమతులు లేకుండా టీఆర్‌ఎస్ ప్రభుత్వం అక్రమ సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తూ దిగువ రాష్టమ్రైన ఆంధ్రప్రదేశ్‌ను ఎడారిగా మారుస్తున్నందుకా ఈ పైశాచిక ఆనందం.. సీమాంధ్రుల పంచెలు ఊడదీసి కొడతామని కేసీఆర్, టీఆర్‌ఎస్ నాయకులు అన్నందుకా ఈ ఆనందం.. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని నీటిదొంగ అని కేసీఆర్, హరీష్‌రావులు తిట్టినందుకా మిఠాయిలు పంచడం.. తెలంగాణ జాగో-సీమాంధ్ర బాగో అని కేసీఆర్ అన్నందుకా బాణాసంచా కాల్చడం.. అని వైకాపా నేతలను తులసిరెడ్డి ప్రశ్నించారు. ఈ అంశాలపై రాష్ట్ర ప్రజలకు జగన్ పార్టీ నాయకులు వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. వైకాపా పార్టీ తెలంగాణ ఎన్నికల్లో పోటీ కూడా చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నందుకు సిగ్గుపడాల్సింది పోయి తగుదునమ్మా అంటూ స్వీట్లు పంచుకోవడం, బాణాసంచా కాల్చడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైకాపాకు రాష్ట్ర ప్రజలు గుణపాఠం చెప్పక తప్పరన్నారు.