ఆంధ్రప్రదేశ్
19న విశాఖలో ఉత్తరాంధ్ర కాంగ్రెస్ సమావేశం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 16 December 2018
విజయవాడ, డిసెంబర్ 15: దివంగత కాంగ్రెస్ నేత ద్రోణంరాజు సత్యనారాయణ 86వ జయంతి సందర్భంగా ఈ నెల 19న విశాఖపట్నంలో జరిగే ఉత్తరాంధ్ర జిల్లాల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, ఏపీ కాంగ్రెస్ ఇన్చార్జి ఊమన్ చాందీ పాల్గొంటారు. అనంతరం 20వ తేదీ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి, కాకినాడలో జరిగే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని పీసీసీ ప్రధాన కార్యదర్శి ఎస్ఎన్ రాజా శనివారం తెలిపారు. అదే విధంగా 21వ తేదీ విశాఖ జిల్లా అనకాపల్లిలో జరిగే పార్టీ సభలో పాల్గొంటారని తెలిపారు.